ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రతి రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నది.సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాల మార్పు జరుగుతున్నదంటే సోషల్ మీడియా ఎంతటి ప్రభావం కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాను ఏ విషయంలోనూ నియత్రించడం చాలా కష్టంగా మారిపోయిందని చెప్పవచ్చు.అందుకే మంచి కోసం ఉపయోగించుకోవాల్సిన సోషల్ మీడియాను ఎక్కువ రకరకాల పనులకు వినయోగిస్తున్నారే తప్ప ఉపయోగకర పనులకు వినియోగించడం లేదు.
అయితే సోషల్ మీడియా అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్.ఇక ఇప్పుడు వీటిల్లో మీమర్స్ హవా జోరుగా సాగుతోంది.ఎవరికో ఎవరినో జతకట్టి రకరకాల సంబంధాలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తారు.మరల ఆ మీమ్ వైరల్ కావడంతో మరల దానికి సెలెబ్రెటీ సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
తాజాగా యాంకర్ శ్యామల విషయంలో కూడా ఇలాగే జరిగింది.తాజాగా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ యాంకర్ శ్యామల బ్రదర్, సిస్టర్ రిలేషన్ అని మీకు తెలుసా అని ఓ మీమ్ క్రియేట్ చేసారు.
అయితే ఈ మీమ్ పెద్ద ఎత్తున నెట్టింట్లో వైరల్ కావడంతో యాంకర్ శ్యామల దీనిపై స్పందించింది.అసలు నాకు తెలియకుండా మీకు ఎలా తెలిసింది అంటూ ఆ మీమ్ పై సెటైర్ వేసింది.