ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది.ప్రజలు కరోనా భయంతో అల్లాడుతున్న వేళ ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ లో మరో అలజడి రేగింది.
తాలిబన్ల అరాచకాలు ఎక్కువైపోయాయి.తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకుని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఆ దేశంలో వారు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు.ఆప్ఘన్ దేశాన్ని తమ వశం చేసుకుని ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.
తాలిబన్ల అరాచకాలకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి నుంచి పారిపోయాడు.దీంతో ఆప్ఘన్ ప్రజలు స్వతంత్రం లేక అల్లాడుతున్నారు.
దేశాన్ని వశపరుచుకున్నాక తాలిబన్లు కఠిన నిబంధనల మధ్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.విదేశీయులకు గడువు ఇచ్చి వారి దేశాలకు వెళ్లిపోమన్నారు.
దీంతో ఆ దేశంలో నుంచి ప్రజలు ఇతర దేశాలకు తరలుతున్నారు.ఈ తరుణంలో ప్రపంచం మొత్తం ఆప్ఘన్ దేశం వైపు చూస్తోంది.
అసలు అక్కడ ఏం జరుగుతోంది, ప్రజలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారోనని ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.గూగుల్ సెర్చ్ లో అప్ఘనిస్థాన్, తాలిబన్ కీవర్డ్స్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లోకి రావడం జరిగింది.
కొన్ని రోజుల నుంచి మనం చూస్తే గూగుల్లో అప్ఘనిస్థాన్ పేరు ట్రెండింగ్ టాపిక్ లోకి ఎక్కింది.
గూగుల్ ట్రెండ్స్ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఎక్కువగా సెర్చ్ చేసిన కీవర్డ్ లేదని చెప్పొచ్చు.
తాలిబన్లు ఆప్ఘాన్ దేశాన్ని వశపరుచుకున్నారో అప్పటి నుంచి ఆ పేరు ట్రెండింగ్ అవుతూ వస్తోంది.అప్ఘనిస్థాన్ దేశంలో మహిళల కేకలు, విదేశీయుల ఆక్రందనలు ఎప్పుడైతే ప్రపంచానికి వినిపించాయో అప్పటి నుంచి తాలిబన్ అనే కీవర్డు గూగుల్ లో ట్రెండింగ్ అవుతోంది.గూగుల్ తో పాటుగా సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆ పేర్లు బాగా వినపడుతున్నాయి.ట్విట్టర్, ఫేస్ బుక్ లో కూడా ఆ పేర్లు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి.
నిజానికి 2004వ సంవత్సరం నుంచి కూడా అప్ఘనిస్థాన్ అనే కీవర్డ్ బాగా పాపులర్ అవుతోంది.గూగుల్ ట్రెండింగ్ లో చూస్తే తాలిబన్లు ఎప్పుడైతే అప్ఘనిస్థాన్ దేశాన్ని వశపరుచుకున్నారో అప్పుడే ట్రెండింగ్ లో ఆ పేరు బాగా పైకి వెళ్లింది.