తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న యాంకర్ ఉదయభాను.ఈమె గురించి ఎన్నో పుకార్లు, మరెన్నో వార్తలు వచ్చాయి.
అలాగే చాలా ఏళ్ల క్రితం బాబా భాస్కర్తో ఈమె ఢీ 2 చేసింది.ఆ షోకు వీరిద్దరు యాంకర్గా వ్యవహరించారు.
ఆ సమయంలో వీరిద్దరి ప్రవర్తన కాస్త అతిగా ఉండేది.రవి, లాస్యల కంటే కాస్త శృతి మించి మరీ వీరిద్దరు బుల్లి తెరపై ప్రదర్శణ చేసేవారు.
దాంతో ఇద్దరి మద్య ఏదో ఉంది అనే పుకార్లు తారా స్థాయిలో వచ్చేవి.
అప్పట్లో వచ్చిన వార్తలపై బాబా భాస్కర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.ఉదయ భానుతో తనకు స్నేహం తప్ప మరేం లేదని, ఆమె నేను ఒక షోకు హోస్ట్లుగా వ్యవహరించాం కనుక క్లోజ్గా ఉండేవాళ్లం.అంతకు మించి ఏం లేదని ఆయన చెప్పుకొచ్చాడు.
మా ఇద్దరి మద్య అప్పట్లోనే వ్యవహారం నడిచింది అంటూ వార్తలు వచ్చాయి.అదే ఇప్పుడైతే మరెంతగా వార్తలు వచ్చేవో అంటూ బాబా మాస్టర్ అన్నాడు.
నేను ఉదయ భానుతో యాంకర్గా చేస్తున్న సమయంలో నా భార్య కూడా పదే పదే నాతో గొడవ పడేది.నేను ఎప్పుడు కూడా ఉదయ భాను వెంట ఉండటం ఆమెకు నచ్చేది కాదు.
ఎందుకు ఊరికే ఆ అమ్మాయితో ఉంటారు, ఆమె చేయి పట్టుకుని డాన్స్ చేస్తారంటూ రచ్చ చేసేది.ఆమెకు అర్థం అయ్యేలా చెప్పేందుకు నాకు సమయం పట్టేదని బాబా మాస్టర్ అన్నాడు.
ప్రస్తుతం బాబా మాస్టర్ తెలుగు బిగ్బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా ఉన్నాడు.ఈయన చాలా సేఫ్ గేమ్ ఆడుతూ అందరి మనసులను గెలుచుకుంటున్నాడు.