రాజకీయాల్లో మంత్రి రోజాకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది.ఆమె చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి.
ఇన్నాళ్లు అటు బుల్లితెరపై కనిపిస్తూనే ఇటు రాజకీయాలను రన్ చేశారు.మంత్రి పదవి రాగానే బుల్లితెరకు గుడ్బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు.
మంత్రివర్గ విస్తరణలో రోజాకు ఏపీ పర్యాటక శాఖ అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.అయితే ఇప్పుడు రోజాకు సొంత నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రోజా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రోజాపై వ్యతిరేకత మొదలైందని చెప్తున్నారు.
అటు ప్రజల్లోనే కాకుండా ఇటు పార్టీలోనూ రోజాకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.రెండు వైపులా వ్యతిరేకత ఉండటంతో రోజా హ్యాట్రిక్ విజయానికి గ్యారంటీ లేదని ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
వైసీపీలో కొన్నాళ్లుగా రోజాకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తోంది.ఆ వర్గానికి ఇప్పటికే కొన్ని పదవులు కూడా దక్కాయి.
రోజా వ్యతిరేక వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రోజా వ్యతిరేకవర్గం ఆమెకు వ్యతిరేకంగా పనిచేసింది.దీంతో ఆమె కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.కొందరు ముఖ్య నేతలు పదవులు సంపాదించుకున్న తర్వాత ముఖ్యమైన సామాజికవర్గం రోజాకు దూరమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే నగరి నియోజకవర్గంలో తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఎక్కువగా ఉన్నారు.వారు కూడా సమస్యలతో ఎమ్మెల్యే రోజా పనితీరుపై పెదవి విరుస్తున్నారు.
మరోవైపు టీడీపీలో నగరి స్థానానికి పోటీ చేసేందుకు గట్టి పోటీ నెలకొంది.అక్కడ రోజాపై పోటీ చేసుందుకు ఓ సెలబ్రిటీ.మరో పొలిటికల్ ఫ్యామిలీ పోటీ పడుతున్నాయి.గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ ఇప్పుడిప్పుడే నగరి నియోజకవర్గంపై పట్టు సాధిస్తున్నారు.అటు సినీ గ్లామర్ ఉన్న మహిళా నేత పేరు కూడా తెరపైకి వచ్చింది.ఆమె ఎవరో కాదు వాణీ విశ్వనాథ్.
నగరిలో ఇటీవల పర్యటించిన ఆమె తన కుటుంబానికి ఇక్కడ ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించింది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నగరిలో రోజాకు ఎదురుగాలి వీడయం ఖాయంగా కనిపిస్తోంది.