తెలుగు సీనియర్ నటి ఆమని గురించి అందరికీ తెలిసిందే.తొలిసారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమని ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
మొదటిసారి జంబలకిడిపంబ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమని.ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి సినిమాల్లో తన నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది.
ఇక తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమని అప్పటినుండి చిన్న చిన్న పాత్రలో నటిస్తూ వచ్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండగా.
కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా, అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో తల్లి పాత్రలో నటించింది.ఇక చావు కబురు చల్లగా సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలు పంచుకుంది ఆమని.
అంతేకాకుండా బోల్డ్ సీన్లలో నటించడంపై కొన్ని అభిప్రాయాలు పంచుకుంది.
2014లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ కథలు సినిమాలో ఆమని బోల్డ్ సీన్లలో నటించింది.అందులో హీరో నరేష్ కు లిప్ లాక్ కూడా ఇచ్చింది.ఇక ఆ విషయం గురించి మాట్లాడుతూ.
సీన్ డిమాండ్ ను బట్టి బోల్డ్ సీన్లలో నటించేందుకు ఇబ్బంది పడనని తడిపింది.ఇది వృత్తిలో భాగంగా చేస్తానంటూ ఇక నరేష్ సీనియర్ నటుడు.
ప్రొఫెషనల్ గా ఆ సీన్ లో మేమిద్దరం నటించామని తెలిపింది.
ఇదిలా ఉంటే సిసింద్రీ సినిమా తర్వాత అఖిల్ తో తల్లి గా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
చిన్నప్పుడు అఖిల్ తో తల్లిగా నటించానని, అప్పుడు అఖిల్ కు ఏం తెలియదని చెప్పుకొచ్చింది.అంతే కాకుండా అఖిల్ తో సినిమా చేసేటప్పుడు చాలా కష్టపడ్డామంటూ, తను నిద్ర పోయినప్పుడు ఆమె కూడా నిద్రపోయేదట.
ఇక ఇప్పుడు కూడా అఖిల్ అమ్మ అంటున్నాడని, చిన్నప్పుడు అతడి తల్లిగా నటించి, ఇప్పుడు మరోసారి తల్లి గా నటించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.