రానా దగ్గుబాటి – త్రిష కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.కాని ఇద్దరు పార్టీ అనిమల్స్ .
ఏదో పార్టీలో మొదలైన వీరి స్నేహం కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది.నిజానికి వీరిద్దరి రిలేషన్ షిప్ ఎప్పుడో అఫిషియల్ గా బయటపడాల్సింది.
కాని వీరీ లవ్ ఎఫైర్ రామానాయుడు గారికి ఇష్టం లేదని అప్పట్లో టాకగ వినిపించింది.తాతయ్య మాట కాదనలేక రానా త్రిషకి దూరంగా వెళ్ళాడు.
త్రిష కూడా వరుణ్ అనే బిజినెస్ మెన్ తో ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళి ఆ తరువాత పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది.దాని తరువాత ఈ ఇద్దరి మధ్య స్నేహం మళ్ళీ చిగురించింది.
సుచీ లీక్స్ లో కూడా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని, కొన్ని ఫోటోలు కూడా లీక్ చేసారు లీకర్స్.అదంతా పక్కనపెడితే, ఇప్పటికి కూడా రానా – త్రిషల మధ్య ఏదో నడుస్తోంది.
మొన్న సాయంత్రం రానా త్రిషకి చాలా కాలం తరువాత ట్వీట్ చేసాడు.అది కూడా ” నాకు ఫోన్ చేయ్ .చాలా ముఖ్యమైన విషయం ” అని.వెంటనే డిలీట్ చేసేసాడు.మీడియావారికి ఎక్కడ చిక్కుతుందో ఆ ట్వీట్ అని సెకన్లలోనే డిలీట్ చేసినా, ఓ సోషల్ మీడియాలో ఏజ్ దొరక్కుండా తప్పించుకోవడం కష్టం కాదుగా.
మరి ఫోన్ చేయమని ట్విట్టర్ లో అడగాల్సిన అవసరం ఏమొచ్చింది ? త్రిష నంబర్ రానా దగ్గర లేదా? లేక త్రిష ఫోన్ కలవకపోవడమతో, సిగ్నల్ దొరకగానే ట్వీట్ చూసి కాల్ చేస్తుందని అనుకున్నాడా.కారణం ఏదైనా మరోసారి పబ్లిక్ గా బుక్ అయ్యాడు మన కండలవీరుడు.