క్రిష్ డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా కొండపొలం.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాను క్రిష్ కంటే ముందే టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ సుకుమార్ కూడా తీయాలని అనుకున్నాడట. కొండపొలం నవల చదివిన సుకుమార్ ఈ కథను సినిమాగా తీయాలని అనుకున్నాడట సుకుమార్.
అయితే ఆ టైం లో పుష్ప కథ రావడం రెండు సినిమాలు అడివి నేపథ్యంలో ఉండటంతో కొండపొలం కథను పక్కన పెట్టి పుష్ప సినిమా చేశారట.
ఈలోగా సుకుమార్, హరీష్ శంకర్ కొండపొలం నవలను క్రిష్ కు రిఫర్ చేశారట.
క్రిష్ నవల చదివి సినిమాగా ప్లాన్ చేయాలని అనుకున్నారు.అదే ఇప్పుడు కొండపొలం సినిమాగా వచ్చింది.
క్రిష్ డైరక్షన్ లో వచ్చింది కాబట్టి కొండపొలం ఇలా ఉంది.మరి ఒకవేళ ఇదే కొండపొలం కథను సుకుమార్ డైరెక్ట్ చేసి ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఆడియెన్స్ అంచనా వేస్తున్నారు.
సుకుమార్ టేకింగ్ వేరే లెవల్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా లెక్క వేరేగా ఉండేదని అంటున్నారు.