ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు అనేవి రోజురోజుకు క్షీణిస్తున్న పరిస్థితి ఉంది.ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా తేడాలున్న పరిస్థితి ఉంది.
ఉమ్మడి కుటుంబాల నుండి చిన్న కుటుంబాలుగా మారి మనుషుల మధ్య ఆప్యాయత, అనురాగాలు, ఒకరిపై ఇంకొకరికి విశ్వాసం ఉండడం అనేది కుటుంబాల మధ్య, మనుషుల మధ్య పూర్తిగా క్షీనించిపోయిన పరిస్థితి ఉంది.అందుకే మనుషులతో ప్రేమగా ఉండడానికి బదులు మూగజీవాలను పెంచుకుంటూ మూగజీవాలతో సన్నిహితంగా ఉంటున్న పరిస్థితి ఉంది.
ఎందుకంటే నిస్వార్థంగా మనుషులతో సఖ్యతగా మెలిగేవి ఒక్క మూగజీవాలనే చెప్పవచ్చు.
అందుకే మూగ జీవాలపై ప్రేమ ఉన్న వారు ఒక శునకాన్ని తప్పక పెంచుకుంటున్న పరిస్థితి ఉంది.
ఎందుకంటే శునకం అంత విశ్వాసంగా ఎవరు ఉండలేరనే చెప్పవచ్చు.తాజాగా తన యజమాని మరణించాడని తెలిసి శవ యాత్రలో శునకం కూడా వారితో పాటు నడుస్తూ తన యజమానికి కన్నీటి వీడ్కోలు పలికింది.
ఇక ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు శునకం చూపిన విశ్వాసానికి ఫిదా అవుతున్న పరిస్థితి ఉంది.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.