ప్రతీ ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘పెళ్లి’ కాగా ఈ వేడుకను అందరి సమక్షంలో జరుపుకోవాలనుకోవడం కామన్.కానీ, వినూత్నంగా జరుపుకోవాలనుకోవడం వెరీ స్పెషల్.
అయితే, అందరి పెళ్లిళ్లు నార్మల్గా అయ్యగార్లు వేద మంత్రాల సాక్షిగా జరుగుతుండటం మనం చూడొచ్చు.అలా కాకుండా డిఫరెంట్ ప్లేస్లో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
డిఫరెంట్గా ఉంటుంది.కదా.అయితే, అలా చేసుకునే వెరైటీ మ్యారేజ్లో అందరూ పాల్గొనే చాన్సెస్ తక్కువగానే ఉంటాయి.కానీ, నూతన వధూవరులకు మాత్రం సూపర్ శాటిస్ఫ్యాక్షన్ ఉండొచ్చు.
తాము అందరి కంటే వినూత్నంగా వివాహం చేసుకున్నామని గొప్పగా చెప్పుకోవచ్చు.ఈ క్రమంలోనే ఓ యువ జంట తమ పెళ్లి వేదికగా నీటిని ఎంచుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ వధూవరులు నీటి అడుగున స్విమ్మింగ్ చేస్తూ మరీ మ్యారేజ్ చేసుకున్నారు.
స్కూబాపై తమకు ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నామని, అందుకే ఇలా వెరైటీగా మ్యారేజ్ చేసుకున్నామని పేర్కొంది ఆ జంట.ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లోని బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్లో వీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియోను మీడియా సంస్థ ది సన్ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది చాలా సార్లు రీ ట్వీట్ అవడంతో పాటు నెట్టింట తెగ సందడి చేస్తోంది.
ఇకపోతే ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.పడవలోనో, హెలికాప్టర్లోనో కాకుండా నీటి అడుగున పెళ్లి చేసుకోవాలనుకున్న వీరి థాట్ వెరీ డిఫరెంట్ అంటున్నారు.ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, మరి కొందరు నెటిజన్లు ఇతర వేదికలపై వెరైటీగా చేసుకున్న పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తున్నారు.సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు.
కానీ, ఇక్కడ నీటి అడుగున నిర్ణయించినట్లయింది.