హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఒక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని టోటల్గా మార్చేసిందని, ఈ క్రమంలో అక్కడ ఎవరు గెలవబోతున్నారు? అనేది ఆసక్తికరమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడబోయే అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.కేవలం బీజేపీ మాత్రమే బలమైన అభ్యర్థిని బరిలో ఉంచింది.ఆయనే మాజీ మంత్రి ఈటల రాజేందర్.టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బరిలో నిలబడి అధికార పార్టీకి సవాల్ విసరుతున్నాడు.
ఇటీవల కాలంగా ఏకంగా మామ అల్లుళ్లకు సవాల్ విసిరారు.తనపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ పోటీకి నిలబడినా సై అని పేర్కొంటూ సత్తా చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంగతులు ఇలా ఉండగా బీజేపీకి చెందిన ఆ ఇద్దరు మహిళా నేతలు హుజురాబాద్ బై పోల్ గురించి అస్సలు ప్రస్తావించడం లేదు.వారు ఎవరంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సినీనటి, బీజేపీ నేత విజయశాంతి.
వీరిరువురు ఈటల రాజేందర్ తరఫున ప్రచారం చేయబోతున్నారనే వార్తలు అప్పట్లో ప్రసారమయ్యాయి.విజయశాంతి ఈటలతో భేటీ కూడా అయ్యారు.
కానీ, ఇప్పటి వరకు హుజురాబాద్ గురించి ప్రస్తావించలేదు.ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్లకు ఏమైంది? అనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు కమలం పార్టీలోనూ ఉంది.ఇకపోతే మోకాలి సర్జరీ తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ మళ్లీ ప్రచారం షురూ చేశారు.నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఆ ఇద్దరు మహిళా నేతలు డీకే అరుణ, విజయశాంతి త్వరలో ఈటల తరఫున ప్రచారం నిర్వహించే అవకాశాలుంటాయని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండబోయే అభ్యర్థి ఎవరు? అనేది ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.అయితే, విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రచారంలో ఉన్నా టీఆర్ఎస్ అధినేత ఇంకా ఆయన్ను అభ్యర్థిగా కన్ఫర్మ్ చేయలేదని తాజా సమాచారం.