టాలీవుడ్ లో చిన్న సినిమాలు చేస్తూ వచ్చి డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా అయిపోయాడు సిద్దు జొన్నల గడ్డ. అయితే అది అంత తన క్రెడిట్ అనుకున్నాడు పాపం మన కుర్ర హీరో.
అక్కడే వచ్చింది అస్సలు సమస్య.సినిమా హిట్ అయితే ఆ ఘనత అంత తమదే అనుకుంటున్నా కుర్ర హీరోలు ఇకనైనా మారాలి.
ఇలా ఆటిట్యూడ్ తో సినిమాల్లో వేలు పెడుతూ తల తిక్క వ్యవహారం లా తయారయిన హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ కాకుండ విశ్వక్ సేన్ కూడా చేరిపోయాడు.ఇక టైటిల్ సాంగ్ తో పాటు అదిరిపోయే బీజీఎమ్ తో, మాట వినే దర్శకుడు దొరకడం తో డీజే టిల్లు దశ తిరిగిపోయింది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ వ్యవహారం మాత్రం పెద్ద సమస్య గా మారిపోయింది.
ఎప్పుడు అయితే హిట్టు వచ్చిన కిక్కు బుర్ర కు ఎక్కించుకొని సీక్వెల్ అన్నౌన్స్ చేసాడో అక్కడే తేడా కొట్టింది.
మొదటి చిత్రానికి దర్శకుడు అయినా విమల్ కృష్ణ సిద్దు తో నాకు ఇంకా వద్దు అనుకోని సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు.స్క్రిప్ట్ లో వేలు పెట్టడం మొదటి సినిమా వరకు ఒకే కానీ రెండవ సినిమాకు ఆ వేషాలు బాగా ముదిరిపోయి తన వల్ల కాదని సినిమా నుంచి తప్పుకున్నాడు.
ఇక మరొక దర్శకున్ని పట్టుకచ్చిన అది ఇంకా అఫీషియల్ గా మారలేదు.సరే దర్శకుడు అంటే కొంత వరకు ఒకే అనుకున్న హీరోయిన్స్ తో అసలు తల నొప్పి వచ్చి పడింది ఇప్పుడు.
ఇప్పటికే చాల మంది హీరోయిన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
మొదట ఫస్ట్ మూవీ లో నటించిన నేహా శెట్టి నే సెకండ్ మూవీ కి కూడా హీరోయిన్ అనుకున్నారు.కానీ ఏమైందో ఏమో కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.ఆ తర్వాత పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల ని కంఫర్మ్ చేసారు.
అఫీషియల్ గా ప్రకటించారు కూడా.కానీ ఆమె తానే ఈ మూవీ నుంచి తప్పుకుంటానని చెప్పి వెళ్లిపోయిందట.
ఆమెకు పెద్ద గిరాకీ ఏమి లేకపోయినా సరే ఈ సినిమాలో నటించలేను అంది.ఇక ఆ తర్వాత కార్తికేయ సినిమా హిట్ అయ్యింది కాబట్టి అనుపమకు పట్టుకోచ్చారు.
ఆమె కూడా మొదట ఒప్పుకుంది.అంతలోనే ఏమైందో కానీ ఆమె కూడా వెళ్ళిపోయింది.
ఇప్పుడు మడోన్నా స్టెబాస్టియాన్ ని ఒకే చేసారు.మరి ఈమె ఎన్ని రోజులు ఉంటుందో వేచి చూడాలి.
వాట్ ఈజ్ దిస్ సిద్దు .వాట్స్ హ్యాపెనింగ్
.