కొన్ని వారాల క్రితం జెమిని టీవీలో ఎన్టీఆర్ ఒక రియాల్టీ షో చేయబోతున్నాడు.అది మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగింది.
స్టార్ మా వారి వద్ద ఉన్న కౌన్ బనేగా కరోడ్ పతి రాయల్టీ రైట్స్ ను జెమిని వారు కొనుగోలు చేశారు.ఎన్టీఆర్ ఓకే అన్నాడు అంటూ ప్రచారం జరిగింది.
ఆ విషయంలో ఇప్పటికి ఎలాంటి క్లారిటీ లేదు.ఎన్టీఆర్ మార్చి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండబోతున్నాడు.
కనుక ఆ తర్వాత ఈ షో ఉంటుందని అంటున్నారు.ఈ షోకు సంబంధించి జెమిని వారు చిన్న లీక్ ఇచ్చి వదిలి పెట్టారు.
మళ్లీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.మరి ఈ షో ఉందా లేదంటే మద్యలో ఆగిపోయిందా అనేది కూడా క్లారిటీ లేదు.
స్టార్ మా మరియు ఇతర ఛానెల్స్ తో జెమిని టీవీ పోటీ పడేందుకు ఈ షోను ఎంపిక చేసుకుందని, ఎన్టీఆర్ కు అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ నిర్వహించేందుకు సిద్దం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.కాని ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల షో ను వాయిదా వేస్తూ వచ్చారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమ్మర్ లో ఈ షో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
మీలో ఎవరు కోటీశ్వరుడుకు సంబంధించిన థీమ్ ను తీసుకుని కాస్త అటు ఇటుగా మార్చి ఈ షోను నిర్వహించబోతున్నారు.జెమిని టీవీలో ప్రసారం అవ్వబోతుంది అంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాని వారి ఎదురు చూపులకు బ్రేక్ పడేది ఎప్పుడో తెలియడం లేదు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది.
కనుక జెమిని షో ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు.