ఏంటో ఈ మధ్య హీరోయిన్స్ బాగా వర్క్ అవుట్ లు చేసి మరింత సన్నబడి పోతున్నారు.నిజానికి వాళ్లు లావుగా ఉండకపోయినా కూడా శరీరంలో ఎముకలు కనిపించే విధంగా సన్నబడి పోతున్నారు.
మామూలుగా బొద్దుగున్నప్పుడే కాస్తో కూస్తో అందంగా ఉండే హీరోయిన్లు ఇప్పుడు సన్నబడిపోవడంతో చూడలేము.
పైగా వాళ్లకి ఏదో వైరస్ వచ్చినట్లుగా ఇక బక్క చిక్కి పోతారు.ఇదంతా ఎందుకు అంటే ఆఫర్ల కోసం.కానీ ఇలా తయారయ్యాకే వాళ్లకు ఆఫర్లు తక్కువైతున్నాయి.ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు హీరోయిన్ లు అలా బక్క చిక్కి ఆఫర్లను అందుకోలేకపోతున్నారు.తాజాగా మరో నటి కూడా అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
ఇంతకూ ఆమె ఎవరో కాదు అమీ జాక్సన్.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి అమీ జాక్సన్.
బ్రిటన్ కు చెందిన ఈమె తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించింది.ఈమె ఫ్యాషన్ రంగంలో మంచి మోడల్ గా నిలిచింది.అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రావడంతో ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యింది.2010లో తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకుంది.ఇక 2014 లో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ఇక మళ్లీ తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించకపోగా వరుసగా తమిళ, హిందీ భాషలలో నటించింది.ఇక ఆ తర్వాత ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని లండన్ లోనే సెటిల్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ.
ఇక సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.నిత్యం తన హాట్ ఫోటోలతో తన శరీర అందాలను చూపిస్తూ బాగా రచ్చ చేస్తుంది.
నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.ఈ బ్యూటీ ఒకప్పుడు చూడ్డానికి చాలా అందంగా ఉండేది.సన్నగా ఉన్నప్పటికీ కూడా చూడ్డానికి ఒక తీరుగా ఉండేది.
కానీ ఇప్పుడు మాత్రం ఏదో వైరస్ వచ్చిన దానిలా బక్క చిక్కిపోయి కనిపించింది.ఆ ఫోటోలో తనేనా అంటే గుర్తుపట్టడం కష్టం.ఎందుకంటే అంత హీనంగా తయారయింది కాబట్టి.
తన ముఖంలో కూడా చాలా మార్పులు వచ్చాయి.ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.గతంలో ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ.
మళ్లీ ఈ మధ్య హాలీవుడ్ లో అడుగు పెట్టింది.పైగా అక్కడ వెబ్ సిరీస్ లలో బాగా బిజీగా మారింది.