తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైనప్పటి నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జెట్ రాకెట్ స్పీడ్తో వెళుతున్నారు.టీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్లో ఎంపీగా గెలవడంతో సంజయ్కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది.
కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ, టీఆర్ఎస్పై ఆయన ఒంటి కాలితో లేస్తూ వచ్చారు.అలాంటి సంజయ్ దూకుడుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సాక్షిగా బ్రేకులు పడ్డాయనే గుసగుసలు బీజేపీ వర్గాల్లోనే జరుగుతున్నాయి.
తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం క్రెడిట్ కూడా చాలా వరకు సంజయ్ ఖాతాలోనే పడింది.
తాజాగా సంజయ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు కట్టుకుంటామని చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి.
అదే సమయంలో భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన కూడా కాస్త కాంట్రవర్సీ అయ్యింది.ఈ సంఘటన తర్వాత ప్రశాంత హైదరాబాద్లో బీజేపీ మత కల్లోలాలు రెచ్చగొడుతుందా ? అన్న సందేహాలను ప్రతిపక్షాలు రైజ్ చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.ఇది మరీ ఎక్కువుగా ప్రజల్లోకి వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువుగా జరుగుతుందని ఇంటిలిజెన్స్ వర్గాలు అధిష్టానానికి చేరవేశాయట.
గతంలో కేసీఆర్ హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ప్లస్ అయ్యాయి.
అయితే ఇప్పుడు బీజేపీ మతకల్లోలాలు హైదరాబాద్లో రెచ్చగొడుతుందన్న టాక్ ప్రజల్లోకి వెళితే ఆ పార్టీకే సీన్ రివర్స్ అవుతుంది.అందుకే కాస్త దూకుడు తగ్గించమని సంజయ్కు బీజేపీ అధిష్టానం సూచించడంతో ఆయనకు కాస్త బ్రేకులు పడ్డాయంటున్నారు.
మరో టాక్ ప్రకారం దుబ్బక ఉప ఎన్నికల్లో విజయం తర్వాత సంజయ్కు తిరుగులేని గుర్తింపు వచ్చింది.
గ్రేటర్లో రెండు రోజుల దూకుడు తర్వాత ఆయన మరింతగా ప్రజల నోళ్లలో నానడంతో సీనియర్లకు కాస్త కంటగింపుగానే మారిందట.
తెలంగాణలో ఆయన దూసుకుపోతున్నారు.దీంతో కొందరు నేతలు పైకి ఫిర్యాదులు చేయడంతో అధిష్టానం ఆయన్ను వ్యూహాత్మకంగా కంట్రోల్ చేసిందని అంటున్నారు.