ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది.చాలా మందికి పెంపుడు జంతువులుగా కుక్కలు పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టపడుతున్నారు.
ఆ కుక్కలను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఆలనాపాలనా చూసుకోవడంతో పాటు కుక్కలను వారి ఇంటి పెరటిలో వదిలేస్తూ ఉండడం సర్వసాధారణం.ఇంటి పెరట్లో ఉన్న కుక్కలు వచ్చిపోయే వ్యక్తులను చూసి పెద్దగా మొరగడం మనం గమనిస్తూనే ఉంటాం.
ఎవరైనా కొత్త వ్యక్తులు వారి ఇంటి వైపుగా వస్తున్నప్పుడు కుక్కలు నానా బీభత్సం చేస్తూ ఉండడం సహజం.ఇలా పెంపుడు కుక్కలు చేయడంతో కొంతమంది అటువైపు వచ్చేందుకు ఇష్టపడరు.
మరి కొందరైతే అవి ఏమీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు పోతారు.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనే అనంతపూర్ జిల్లాలో కళ్యాణదుర్గం చెందిన ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
పెంపుడు కుక్క ప్రతిరోజూ అరుస్తుందన్న నెపంతో ఆ వ్యక్తి చేసిన పని ఆ గ్రామంలో సంచలనం సృష్టిస్తుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రమేలు వీధిలో సుధాకర్ అనే వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన కుక్కను ఇంట్లో పెంచుకుంటే పెరటిలో వదిలి పెట్టేవాడు.కుక్క గేటుకు అవతలి వైపు వెళ్తున్న వ్యక్తులను తరచూ మొరుగుతూ ఉండేది.
చాలా మంది ఆ అరుపులు పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేవారు.కానీ అదే ప్రాంతానికి చెందిన జహీర్ అనే వ్యక్తి రోజు అటుగా వెళ్తున్న సమయంలో ఆ కుక్క మొరగడం వల్ల ఆగ్రహానికి గురయ్యాడు.
దీనితో యజమాని జహీర్ తో కొన్ని సార్లు గొడవకు దిగాడు.కుక్కను అదుపులో పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు కూడా.
కానీ, ఆ కుక్క ఆయన చూసి మొరుగుతూనే ఉండడంతో తనను చూసి ఇలా మరుగుతున్న కోపంతో ఒక్కసారిగా దాడి చేసేందుకు కొడవలితో జహీర్ సుధాకర్ తో గొడవకు దిగాడు.వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలు అవడం, మాటా మాటా పెరగడంతో జహీర్ తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో సుధాకర్ పై దాడికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో దాడిలో భాగంగా సుధాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అనంతపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.ప్రస్తుతానికి మాత్రం సుధాకర్ పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు నిపుణులు పేర్కొంటున్నారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని జహీర్ ను అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు.