ఏపీ సర్కార్ వింత వింత నిర్ణయాలు, వింత పోకడలతో ముందుకు వెళుతుందన్న అభిప్రాయాలే ఇప్పటి వరకు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు చాలా మంది ప్రజలకు, కొన్ని వర్గాలకు ఏ మాత్రం రుచించడం లేదు.
అయితే తాము చెప్పిందే వేదం.చేసిందే శాసనం అన్న పద్ధతిలో పాలన ఉండడంతో ఎవ్వరూ ఏం చేసేది లేక పాలన చూస్తే కళ్లప్పగించేస్తున్నారు.
కొందరు నెత్తి నోరు బాదుకుంటూ ఇవేం నిర్ణయాలు రా బాబోయ్ అనుకుంటున్నా వారి గోడు పట్టించుకునే వారే లేరు.
తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలు ఏర్పాటు చేసింది.
ఇందులో విజయవాడ నగరానికి ఆనుకునే ఉన్న నాలుగు కీలక గ్రామాలను కలుపుతూ వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ ఏర్పాటు చేసింది.ఇప్పటి వరకు వీరంతా గ్రేటర్ విజయవాడలోకి వెళ్లిపోతామని అనుకుంటోన్న టైంలో జగన్ ప్రభుత్వం సడెన్ షాక్ ఇస్తూ వైఎస్సార్ పేరు ముందు కలిపి వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాల్టీ చేసింది.
ఇదంతా పెనమలూరు నియోజకవర్గంలో అంతర్భాగం.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకు పేర్లు ఏర్పాటు చేసినట్టు ఇప్పుడే ఊర్ల పేర్లకు కూడా వైఎస్సార్ పేరు తగిలించేసింది.
అసలు వైఎస్సార్కు తాడిగడపకు సంబంధం లేదు.పైగా ఇది తెలుగుదేశం పార్టీకి పట్టున్న ఓ వర్గం వారి డామినేషన్ ఎక్కువ.ఇక్కడ సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయి.వాటిని కాదని జగన్ ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీకి ముందు వైఎస్సార్ పేరు కలిపేసింది.ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారిలో చాలా మందికి ఇది ఇష్టం లేకపోయినా నోరు మెదిపే పరిస్థితి లేదు. పెనమలూరు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉంది.
ఈ ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేస్తానని జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఆ పేరు పెట్టలేదు కాని.
టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఓ మున్సిపాల్టీ ఏర్పాటు చేసి దానికి వైఎస్సార్ పేరు పెట్టేశారు.త్వరలో కృష్ణా జిల్లా పేరు మారిస్తే. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ మున్సిపాల్టీ ఉన్నట్లవుతుంది.మరి జగన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడతానన్న హామీని నెరవేరుస్తారా ? మర్చిపోతారా ? అన్నది చూడాలి.