ఒకప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అని అడిగినా అందరికి గుర్తొచ్చే పేరు దాసరి నారాయణ రావు.ఇక దాసరి మృతి తర్వాత ఇక ఆ స్థానం అలా ఖాళీగా ఉంది.
అయితే దాసరి తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి తీసుకోవాలని బహిరంగంగానే చిరంజీవి ముందే కొంత మంది నటులు అడిగిన పరిస్థితి ఉంది.అయితే దీనిపై చిరు స్పందించలేదు.
ఇక చిరంజీవి విషయానీకొస్తే చిరంజీవి అంటే ఓ చరిత్ర.మహా నటుడు అన్న విషయం మనకు తెలిసిందే.
అయితే నేను పెద్ద నటుడిని అన్న గర్వం ఎప్పుడూ ప్రదర్శించడు.అలా కొత్త నటులతో వారి అనుభవాలు తెలుసుకుంటూ, తన అనుభవాలను పంచుకుంటూ ఒక అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తాడు మెగాస్టార్ చిరంజీవి.
అయితే చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే జై చిరంజీవ షూటింగ్ సమయంలో నటుడు సమీర్ షూటింగ్ కి లేటుగా వచ్చాడట.
అయితే ముందు రోజు అయ్యప్ప మాల వేసుకొనడానికి వెళ్తున్నానని డైరెక్షన్ టీం కు చెప్పినా కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఆ సమాచారం చేరలేదు.అయితే షూటింగ్ చేద్దామని చెప్పి చిరంజీవి మేకప్ వేసుకొని రెడీగా ఉన్నాడట.
ఇక అప్పటికే చిరంజీవి మేనేజర్ సమీర్ కి కాల్ చేస్తున్నా ఫోన్ సైలెంట్ లో ఉండటం వలన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.ఇక సెట్ కు వచ్చిన తరువాత అందరూ నన్ను ఓ దోషిగా చూస్తున్నారని, ఇక చిరంజీవి మేనేజర్ ఈరోజు నీ పని అయిపొయిందని చెప్పడంతో సమీర్ కి పెద్ద ఎత్తున టెన్షన్ మొదలైందని, అయితే సమీర్ ని కార్వాన్ లోకి తీసుకెళ్లిన చిరంజీవి నువ్వు సమీర్ అని ముస్లిం పేరు పెట్టుకున్నావ్ మరల ఈ అయ్యప్ప మాల అంటావ్ ఏంటి దీని కథ అని సమీర్ ని అడిగాడట చిరంజీవి.
ఇక లేట్ గా వచ్చానని చిరంజీవి ఏమీ అనకపోవడంతో సమీర్ ఊపిరి పీల్చుకున్నాడట.