డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు దేశంలో ఎంత హాట్ టాపిక్ గా నడుస్తుందో తెలిసిందే.మొన్నటి దాకా సినీ ఇండస్ట్రీలను కుదిపేసిన ఈ ఘటనలు మనం చూస్తున్నాం.
ఇకపోతే డ్రగ్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ మత్తు కోసమే దీన్ని వాడుతుంటారు.దీన్ని వేసుకుంటే ఏదో తెలియని మైకంలో ఉంటామనే భావనతోనే చాలామంది దీన్ని తీసుకుంటున్నారు.
అయితే డ్రగ్స్ పేరు వింటేనే పోలీసుల తనిఖీలు ఎంతలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు.
అయినా సరే దాన్ని సాధించేందుకు కొందరు చేస్తున్న పనులు షాక్ ఇస్తున్నాయి.
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
అయితే చాలామంది తమకు రాని పనుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా వాడుతున్నది యూట్యూబ్ .ఇప్పుడు కూడా ఓ యువకుడు డ్రగ్స్ తయారు చేసేందుకు యూట్యూబ్ ను నమ్ముకున్నాడు.ఏకంగా ఓ ల్యాబ్ ను రెడీ చేసుకుని అందులో డ్రగ్స్ను తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోలను ఎంచుకున్నాడు.గుజరాజ్ కు చెందిన జైమిన్ సావని డ్రగ్స్ అలవాటు ఉంది.
అయితే దీన్ని అమ్మితే లాభాలు పెద్ద ఎత్తున వస్తున్నాయని గ్రహించాడు.
దీంతో మెథాంఫెటమైన్ ను తయారు చేసేందుకు రెడీ అయిపోయాడు.
తానే తయారు చేసి అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు.సూరత్ లోని సర్థానా ఏరియాలో ల్యాబ్ను ఏర్పాటు చేసి వీడియోలు చూసుకుంటూ కొన్ని మెళకువలు నేర్చుకున్నాడు.
కాగా అతను ఇలా తయారు చేస్తున్న క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ అనే డ్రగ్స్ అమ్మక దారుడు గుజరాత్ వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు.అయితే అతన్ని విచారించే క్రమంలో సావని చేస్తున్న పనులు బయటపడ్డాయి.
దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
.