న్యుమోనియా. ఇది ఊపిరితిత్తులకు వచ్చే ఓ అంటు వ్యాధి.
ప్రస్తుత ఈ చలి కాలంలో చిన్న పిల్లలను, గర్భిణీ స్త్రీలను, ముసలి వారిని, ధూమపానం అలవాటు ఉన్న వారిని, మధుమేహం వ్యాధి గ్రస్తులను ప్రధానంగా వేధించే సమస్యల్లో న్యుమోనియా ముందు వరసలో ఉంటుంది.అయితే ఈ వ్యాధిపై సరైన అవగాహన లేక పోవడం వల్ల చాలా మంది న్యుమోనియాను తీవ్ర తరం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అందుకే న్యుమోనియాను ఎలా గుర్తించాలి.? అసలు దాని లక్షణాలు ఏంటీ.? లక్షణాలు గుర్తించిన వెంటనే ఏం చేయాలి.? వంటి విషయాలు ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
న్యుమోనియా సోకగానే.జలుబు, జ్వరం, దగ్గు, తుమ్ములు, వాంతులు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.అలాగే తీవ్రమైన చలి, చెమటలు ఎక్కువగా పట్టడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆకలి మందగించడం, ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి వంటి లక్షణాలు కూడా కనిస్తుంటాయి.
ఈ లక్షణాలు మీలో ఉంటే గనుక వెంటనే వైద్యుడిని సంప్రదించి ఛాతి ఎక్స్–రే తీయించుకోవాలి.
దీంతో పాటు రక్త పరీక్ష కూడా చేయించుకోవాలి.
లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యం తీసుకుంటే న్యుమోనియా నుంచి త్వరగా బయట పడతాయి.లేకుంటే మాత్రం వ్యాధి ముదిరి పోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.పైగా వ్యాధి ముదిరిన కొద్దీ.
కళ్లు తిరగడం, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అందు వల్లనే న్యుమోనియా వ్యాధి లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచిస్తున్నారు.
ఇక న్యుమోనియా అంటు వ్యాధి. కాబట్టి.
ఇంట్లో ఒకరికి వచ్చినా.మిగిలిన వారందరికీ సోకే ప్రమాదం ఉంటుంది.
అందుకే న్యుమోనియా బారిన పడిన వారు మాస్క్ ధరించాలి.వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
ధూమపానం అలవాటును మానుకోవాలి.పోషకాహారాలు తీసుకోవాలి.
గోరు వెచ్చని నీటిని సేవించాలి.ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.