త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ కసరత్తును ప్రారంభించాయి.ఇంకా రంగంలోకి దిగకపోయినా ఇప్పటికే అన్ని పార్టీలు పార్టీపరమైన వ్యూహాలను పన్నుతున్నాయి.
అదే విధంగా ఇప్ప్పటికే టీఆర్ఎస్ సైతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలవాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న టీఆర్ఎస్, అక్కడ బండి సంజయ్ ఎన్నికల ప్రచారానికి వచ్చి అక్కడ పోలీసులను రెచ్చగొట్టడం, పోలీసులకు గాయాలవడం ఇలా ఈ నియోజకవర్గంలో ఎన్నికపై కొంత అసహన పరిస్థితులు ముందుగానే చోటు చేసుకోవడం, పైగా బీజేపీ టీఆర్ఎస్ కంటే ముందుగానే రంగంలోకి దిగడంతో కేసీఆర్ పై కొంత ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సందర్బంగా బహిరంగ సభలో అసహనంగా కేసీఆర్ ఉండటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అంతేకాక అక్కడ బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చే నాయకుడు కరువవడం, మొట్టమెదట్లోనే బీజేపీకి ఫ్రీ హ్యాండ్ వస్తే ఇక బీజేపీ చెలరేగే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఈ విషయం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి చివరికి అక్కడ ఏ పార్టీ పై చేయి సాధించి విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.