కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా అది పూర్తి స్దాయిలో ప్రజలకు ఇంకా చేరలేదన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో మనదేశంలో ఇంకా అక్కడక్కడ కొత్తగా కరోన కేసులు నమోదు అవుతున్నాయి.
ఇకపోతే గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో కొత్తగా 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది.కాగా కోవిడ్ 19 బారిన పడి కోలుకున్న వారిలో 147 మంది ఉన్నారట.
అయితే మరణించిన వారిలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారట.
ఇక ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,004 ఉండగా, దీని బారి నుండి కోలుకున్న వారి సంఖ్య 8,79,651 మంది వరకు ఉన్నారట.కాగా మరో 1197 మంది అస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 7156 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఏది ఏమైనా ఇంకా మనమధ్య నుండి కరోనా దూరం అవలేదు కాబట్టి ప్రజలందరు కోవిడ్ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటే ఈ వైర్స్ వ్యాప్తిని కొంతవరకైనా అరికట్టవచ్చు.