ఆ దేశం చూసేందుకు చిన్నగానే ఉన్నా.ప్రపంచాన్ని ప్రభావితం చేసేంత స్థాయిలో ఉంది.
ప్రపంచమంతా ఇంతలా డెవలప్ అవుతున్నా సరే అక్కడి ప్రజలు మాత్రం ఇంకా చాలా వెనకాలే ఉన్నారని చెప్పొచ్చు.కనీసం ఫోన్లు కూడా వాడరంటే అక్కడి నిబంధనలు ఎంత కఠినతరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఆ దేశంలో ఏం జరిగినా సరే ప్రపంచానికి తెలియదు.అంత కఠినమైన పాలనను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్నాడు.
ఆయన వివాదాల్లో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒకప్పుడు అమెరికాను సైతం తన చేష్టలతో గజగజ వనికేలా చేశాడు.
అందుకే అతన్ని అందరూ నియంత అని కూడా చెబుతుంటారు.ఎందుకంటే చిన్న చిన్న పనులకే అతను వేసే శిక్షలు అలా ఉంటాయనే ప్రచారం కూడా ఉంది.
కిమ్ కు ఎవరైనా నచ్చకపోతే సొంత కుటుంబ సభ్యులు అయినా సరే మరణశిక్షలు విధించడం గతంలో అనేకం చూశాం.అయితే ఇప్పుడు కూడా ఓ యువకుడికి ఇలాగే మరణశిక్ష విధించాడు.
అయితే ఇందుకు వారు చెప్పిన రీజన్ వింటే నిజంగానే షాక్ అయిపోతామేమో అనిపిస్తుంది.మరి ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం.
ఈ దేశంలో ఓ యువకుడు చైనా సర్వర్ల ద్వారా స్విడ్ గేమ్ సిరీస్ను డౌన్ లోడ్ చేసుకుని ఆ గేమ్ను చూశాడనే కారణంగా ఆ యువకుడికి అక్కడి ప్రభుత్వం ఏకంగా మరణశిక్షను విధించింది.అంతే కాకుండా తను ఫ్లాష్ పెన్ డ్రైవ్ లలో కొందరు స్టూడెంట్లకు కూడా వాటిని అమ్మాడని చెప్పి అతన్ని శిక్షకు అర్హుడు అంటూ పేర్కొంది అక్కడి ప్రభుత్వం.అయితే ఈ రీజన్ విన్న యావత్ ప్రపంచం షాక్ అయిపోయింది.ఇలాంటి చిన్న పనికి కూడా ఇలా చేస్తారా అంటూ విమర్శిస్తున్నారు.ఇప్పుడు ఈ వార్త కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.