కండోమ్ దేనికోసం తయారు చేయబడిందో ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు.శృంగారంలో పాల్గొన్నప్పుడు అవాంచిత గర్భం, సుఖవ్యాధుల నుంచి రక్షణ పొందేందుకే కేవలం దాన్ని తయారుచేసారు.
అయితే ఈ కండోమ్ను శృంగారానికి కాకూండా.మరో విధంగా కూడా ఆ స్టూడెంట్స్ ఉపయోగిస్తున్నారట.
దాంతో కొంతమంది యువతకి కండోమ్ ఓ వ్యసనంగా మారింది.బెంగాల్లోని దుర్గాపూర్లో కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.
ఏం జరుగుతుందని ఓ సర్వే చేపట్టారు.దాంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
విషయంలోకి వెళితే…
గత కొన్ని రోజులుగా దుర్గాపూర్లోని పలు ప్రాంతాలైన దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్ నగర్, బెనచిటి, ముచిపర, సి జోన్, ఎ జోన్లలో రకరకాల ఫ్లేవర్ కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి.ఒక్కోసారి కొందరు బల్క్ మొత్తంలో వాటిని కొనుగోలు చేశారట.
ఇంత మొత్తంలో ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఓ షాపు యజమానికి అనుమానం వచ్చి తన రెగ్యులర్ కస్టమర్ అయిన ఒక యువకుడిని అడగగా.మత్తు కోసం కండోమ్లు కొంటున్నానని చెప్పాడట.
దాంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడట.విషయం తెలుసుకున్న దుర్గాపూర్ ప్రజలు అవాక్కయ్యారు.విషయం ఏమంటే…
షాఫులో కొనుగోలు చేసిన కండోమ్లను దుర్గాపూర్లోని కొందరు యువకులు రాత్రంతా వేడి నీటిలో నానబెడుతున్నారు.అలా దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచిన ఆ తర్వాత నీటిలోంచి కండోమ్లను తీసేసి ఆ నీటిని తాగుతున్నారు.ఆపై వారికి బాగా మత్తు ఎక్కుతుందట.దుర్గాపూర్లోని చాలా మంది యువకులు దీనికి బానిసలుగా మారారు.ఈ విషయమై దుర్గాపూర్ డివిజనల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ధీమాన్ మండల్ మాట్లాడుతూ.వేడి నీటిలో కండోమ్లను దీర్ఘకాలికంగా నానబెట్టడం వల్ల ఆర్గానిక్ అణువులు ఆల్కహాలిక్ సమ్మేళనాలుగా విచ్ఛిన్నం అయి మత్తు వస్తుందని, దానికి వారు బాగా అలవాటు పడ్డారని పేర్కోవడం కొసమెరుపు.