పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే నందిగ్రామ్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగడంతో కాలికి గాయం అయింది.
కారు వద్ద నిలబడిన సమయంలో కొందరు వ్యక్తులు కారు డోర్ చాలా బలంగా తోయటంతో… తన కాలికి గాయం అయినట్లు మమత బెనర్జీ స్పష్టం చేసింది.
జరిగిన ప్రమాదం వల్ల కాలుకు వాపు వచ్చిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడి వెనకాల కుట్ర దాగి ఉంది అనే అనుమానాన్ని వ్యక్తంచేసింది.కారణం చూస్తే తాను ప్రచారానికి వెళ్లే సమయంలో తన చుట్టుపక్కల పోలీసులు ఎవరూ లేరని .ఈ ఘటనకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాను అంటూ దీదీ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే అధినేత్రికి గాయం కావడంతో పార్టీ శ్రేణులు వెంటనే స్పందించి ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
నామినేషన్ వేసిన తర్వాత ఈ ఘటన జరగటంతో పార్టీ శ్రేణులు.ఖచ్చితంగా ఈ ఘటన వెనకాల ప్రత్యర్థుల కుట్ర దాగి ఉందని భావిస్తున్నారు.మరోపక్క బిజెపి పార్టీ నేతలు మమతా బెనర్జీ పై దాడి అనేది పెద్ద నాటకం అన్నట్టు పేర్కొంటున్నారు.
.