పశ్చిమ బెంగాల్ మొదటి దశలో ఎన్నికల ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.30 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో దాదాపు 27 స్థానాలు బిజెపి పార్టీ కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.దీంతో అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ కౌంటర్లు వేశారు.ఈవీఎంలలో దూరి…వేసిన ఓట్లను అమిత్ షా ఏమైనా లెక్క పెట్టారా అంటూ కౌంటర్లు వేశారు.బెంగాల్ రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలు ముగిసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు బీజేపీ నాయకులకు మధ్య మాటల యుద్ధం భారీ స్థాయిలో పెరిగింది.
బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అందువల్లే తొలిదశ ఎన్నికల్లో 84 శాతం ఓటింగ్ పోల్ అయిందని.
ఖచ్చితంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందలకు పైగా స్థానాలలో బీజేపీ గెలవడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.దీదీ పాలనకు మే రెండవ తారీఖున బెంగాల్ ప్రజలు చరమగీతం పడతారని అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అస్సాంలో కూడా రెండోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.ఈ క్రమంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిపించి ముందుకు ఈసీకి ధన్యవాదాలు అని తెలిపారు.
.