మమతా బెనర్జీ నేడు బెంగాల్ ముఖ్యమంత్రి గా మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మమతా తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పూర్తి విషయంలోకి వెళితే పాత డిజిపి వీరేంద్ర కు తిరిగి బాధ్యతలు అప్పగించారు.ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ నియమించిన నీరజ్ నీ బదిలీ చేయించారు.
అంతే కాకుండా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసి… బదిలీ చేసిన ఇద్దరు ఉన్నత అధికారులను కూడా తిరిగి.అదే పోస్టింగ్ కి వచ్చేలా.
హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు.
ఇదే క్రమంలో బెంగాల్ రాష్ట్రానికి 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని.
ప్రధాని మోడీ కి లెటర్ రాశారు.ఇదే క్రమంలో కరోనా కట్టడి కోసం పాక్షిక కర్ఫ్యూ రాష్ట్రంలో విధిస్తున్నట్లు… ఆర్.టి.పి.సి.ఆర్.పరీక్షలో నెగిటివ్ రిపోర్టు ఉంటేనే బెంగాల్లో ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు.మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ కి రానున్న రోజుల్లో.
రాష్ట్రంలో అనేక కొరతలు తీరేలా కేంద్రంతో ఆమె వ్యవహారం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర పెద్దలతో డి అంటే డి అన్న విధంగా.
దిది వ్యవహరించింది.మరి రానున్న రోజుల్లో కేంద్రం.
బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్నది సస్పెన్స్ గా మారింది.