దేశంలో రోజు రోజుకి డీజిల్ మరియు పెట్రోల్ ధర కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఎలక్ట్రికల్ స్కూటర్ నడుపుతూ నిరసన వ్యక్తం చేశారు.
మేయర్ ఫిర్హాద్ బండి డ్రైవింగ్ చేయగా దీదీ వెనక కూర్చున్నారు.
ఇటువంటి తరుణంలో సచివాలయం నుండి తిరిగి వెనక్కి వచ్చే తరుణములో మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ బైక్ నడపాలని ప్రయత్నించగా స్కూటీ మీద నుండి కింద పడిపోబోయారు.
వెంటనే పక్కనే ఉన్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి ఆమెను కింద పడిపోకుండా కాపాడారు.అదృష్టవశాత్తు మమతా బెనర్జీకి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఆ తర్వాత వెంటనే మేయర్ ఫిర్హాద్ బండి తీసుకొని ఆమెను సురక్షితంగా కాళీ ఘాట్ కు చేర్చారు.
తాజా వార్తలు