దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది.రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
లాక్ డౌన్ సడలింపులకు ముందు 6,000కు అటూఇటుగా నమోదైన కేసులు ప్రస్తుతం 30,000కు అటూఇటుగా నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కట్టడి కోసం శ్రమిస్తున్న వారియర్స్ సైతం వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా కరోనా సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం మమతాబెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఇప్పటివరకు 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనాకు బలి కాగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం ప్రకటన చేశారు.
వైద్యులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు వైరన్ నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.దీంతో వాళ్లు కరోనా బారిన పడి మరణిస్తే వాళ్ల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని అన్నారు.
ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలో కరోనా నియంత్రణ కొరకు కృషి చేస్తున్న వాళ్లకు సైతం ఇదే విధంగా ఆర్థిక సహాయం అందజేస్తామని కీలక ప్రకటన చేశారు.రాష్ట్రంలో రోజురోజుకు కరోనా భారీన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందని ప్రజలు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తే మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉంటామని అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఇప్పటివరకు 34,427 కరోనా కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 1,589 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది మృతి చెందారు.ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.