తమ పార్టీ అభ్యర్థుల ఓటమి పై బెంగాల్ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ?

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్దాయిలో విజయాన్ని సాధించలేదని నిన్న వెలువడిన ఫలితాల్లో వెల్లడి అయిన విషయం తెలిసిందే.అయితే ఈ ప్రజా తీర్పు విషయంలో స్పందించిన బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 West Bengal Bjp Chief Dilip Ghosh Sensational Remarks On The Defeat Of Party Can-TeluguStop.com

కాగా 2016 ఎన్నికల్లో మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైన తాము ఈసారి చాలా స్థానాల్లో కొద్దిపాటి మెజారిటీతోనే తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తూ ఈ తీర్పును గౌరవిస్తున్నామని, కానీ ప్రజల తరపున శాసనసభలో గళం విప్పుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అయితే ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని, ఎన్నికల ఫలితాలను చూసే వరకు ఊహించలేదన్నారు.

ఇకపోతే చాలామంది నేతలు ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని, ఇలా చేసిన వారంతా ఓటమి పాలయ్యారని దిలీప్ ఘోష్ వివరించారు.బహుశా అందువల్లే కావచ్చూ ఎన్నికలకు ముందు పార్టీని వీడిన నేతలను ప్రజలు అంగీకరించలేదని ఓటమి పై వివరణ ఇచ్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube