ప్రతి ఒక్కరికి వారి జీవితంలో అదృష్టం ఎదో ఒక సమయంలో ఒకసారి వారి తలుపు తడుతుంది అని అందరూ అంటూ ఉండడం మనం వింటూనే ఉంటాం.అందుకు తగ్గటటుగానే తాజాగా ఒక యువకుడికి మాత్రం అనుకోకుండా అదృష్టం ఇట్టే కలిసి వచ్చింది.
బంధువుల పెళ్లి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిన ఆ యువకుడు కోటీశ్వరడు అయ్యి తన ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో మద్దూరు తాలూకా లోనిసోమనహళ్ళి గ్రామానికి చెందిన బలరామ్ అనే యువకుడు కేరళలోని తమ బంధువు ఇంటికి వివాహం కోసం వెళ్ళాడు.
కేరళలో వివాహం చూసుకొని తన స్నేహితుడు ఆయన దేవదాసు ఇంటికి వెళ్లి ఆయన దుకాణంలో కేరళ భాగ్య మిత్ర లాటరీ టికెట్ ను 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు బలరామ్.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కారులో తన ఇంటికి బయలు జరుగుతున్న క్రమంలో అతనికి అనుకోకుండా తన ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చి నువ్వు తీసుకున్న టికెట్ కోటి రూపాయలు వచ్చిందని మిత్రుడు చెప్పగా ముందుగా ఆటపట్టిస్తూ ఉన్నాడని అనుకున్నాడు.
పదేపదే ఫోన్ చేస్తూ లాటరీ టికెట్ ను వెంటనే తీసుకొనిరా అని తెలపడంతో తిరుగు ప్రయాణం చేశాడు.డ్రా లో వచ్చిన నెంబర్ చూసుకుంటే నిజంగానే 1 కోటి రూపాయల లాటరీ తగిలింది.
దాదాపు 48 మంది లాటరీ టికెట్లు కొన్న కానీ అందులో కేవలం ఐదు మంది మాత్రమే ఈ అదృష్టం వరించింది.ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ లాటరీ టికెట్ తో వచ్చిన డబ్బుతో వారికి ఉన్న రైస్ మిల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటానని తెలియజేశాడు.
ఏది ఏమైనా కానీ అదృష్టం అంటే ఇదేనేమో మరి.