టాలీవుడ్ ఇండస్ట్రీలో చారిత్రక సినిమాలతో గుణశేఖర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇటు చారిత్రక కథల నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తూ ఉంటాడు.
లాఠీ, ఒక్కడు, చూడాలని ఉంది, రుద్రమదేవి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు.భారీ సెట్టింగులతో పెద్ద బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడం గుణ శేఖర్ స్టైల్.
ఆయన చివరి సారిగా అనుష్క తో కలిసి రుద్రమదేవి సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో వెంటనే మరొక సినిమా ప్రకటించాడు.
ప్రతాపరుద్రుడు అనే సినిమాను ప్రకటించాడు కానీ దీనిని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు.ఇదిలా ఉండగా ఈ స్టార్ డైరెక్టర్ కూతురు పెళ్లి నిన్న ఘనంగా జరిగింది.
గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ ప్రెజెంట్ ఈయన తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాకు నిర్మతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈమె వివాహ మహోత్సవం తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ లో డిసెంబర్ 2 న ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త డా రామకృష్ణ పింజల కుమారుడు రవి ప్రఖ్యాతో జరిగింది.
అంగరంగ వైభవంగా పలువురు బంధువులు, సినీ రాజకీయ అతిథుల మధ్య వీరి వివాహం జరుగగా దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఇక గుణశేఖర్ సినిమాల విషయానికి వస్తే.
ప్రెజెంట్ ఇతడు సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టు కుంది.ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతుంది.ఈ సినిమాలో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ నటించ బోతుంది.