తెలుగు హీరోయిన్స్ స్నేహ ఉల్లాల్, మధుశాలిని, టోనీలుక్, అలీ రెజా నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ఎక్స్పైరీ డేట్.ఈ వెబ్ సిరీస్ కి శంకర్ కే మార్తాండ్ దర్శకత్వం వహించగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు.
మొదటి సారి తెలుగు మరియు హిందీ భాషల్లో రూపొందిన మొదటి వెబ్ సిరీస్ గా దీనికి ఇటీవలే విడుదల చేశారు.ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.మర్డర్ కేసు నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అందరిని ఆసక్తికరంగా ఓటీటీ ముందు కూర్చోబెట్టింది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ భారీగా చేస్తున్నారు.ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రైట్స్ దక్కించుకున్న జీ5 వారికి మంచి లాభాలు రావడం ఖాయం అంటున్నారు.
తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వెబ్ సిరీస్ ను ఆదరిస్తే బాగుంటుందని నిర్మాతలు కోరుకుంటున్నారు.వెబ్ సిరీస్ ల విషయంలో ఇంకా తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఆసక్తి చూపడం లేదు.
అందుకే ఇలాంటి వెభ్ సిరీస్ లకు తెలుగు ప్రేక్షకులు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.అయినా కూడా ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా తెలుగువారు కూడా చూస్తారనే నమ్మకంను నిర్మాతలు మరియు జీ5 వారు వ్యక్తం చేస్తున్నారు.
ఒకసారి ఈ వెబ్ సిరీస్ కు తెలుగులో మంచి కామెంట్ వస్తే కచ్చితంగా అందరు చూస్తారు.అయితే ఈ వెబ్ సిరీస్ జీ5 లో ఉండడం వల్ల కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది.జీ5 అనేది అందరికీ లేదనే టాక్ వినిపిస్తోంది.అమెజాన్, ఆహా వంటి వాటిని మాత్రమే తెలుగు వారు ఎక్కువగా సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారు.
ఎక్కువగా అందులో ఉండే కంటెంట్ మరియు షో లను మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు.అందువల్లే ఈ వెబ్ సిరీస్ ను తక్కువగా చూస్తున్నారంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాదిన మాత్రం సందేహం లేకుండా కుమ్మేస్తుంది.మొత్తానికి మన వాళ్లు చేసిన తీసిన వెబ్ సిరీస్ అక్కడ కుమ్మేయడం తెలుగు వారికి గర్వకారణం.