ఆంధ్రోళ్ళ ఓట్లు తోనే గెలుస్తాం చూడండి - కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆంధ్రా ప్రాంతం జనాలు వేసే ఓట్లతో నే గెలవాల్సి ఉంటుంది.ఎన్నో ఏళ్లుగా హైదరబాద్ లో పాతుకుపోయిన ఆంధ్రా జనాలు హైదరాబాద్ నిండా ఉన్నారు.

 We Will Win Ghmc Elections With Andhra People Help – Ktr-TeluguStop.com

ఈ ఎన్నికలకి వారే కీలకం కానున్నారు.వారి మెప్పు పొందడం కోసం ఆయా పార్టీలు వారి వారి పనుల్లో బిజీ గా ఉండగా అధికార తెరాస అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచీ వారినే టార్గెట్ చేసుకుని హైదరాబాద్ అభివృద్ధి చేపడుతోంది.

అప్పట్లో ఆంధ్రోళ్ళు అంటూ వారిని తరిమేస్తాం అంటూ గొడవ చేసిన కెసిఆర్ సైతం గెలిచిన తరవాత సైలెంటయిపోయారు.ఈ ఎన్నికల నేపధ్యాన్ని కెసిఆర్ స్వయంగా తన కొడుకు కేటీఆర్ కి అప్పజెప్పారు ఆ ఈ ఎన్నికల్లో తెరాస ని గెలిపించే బాధ్యత కేటీఆర్ ది అన్నమాట.

ఎన్నికల కోసం హైదరబాద్ లో విరివిగా ప్రచారం చేస్తున్న ఆయన కెసిఆర్ ని ప్రజలకి దగ్గర చేసే పనిలో పడ్డారు.సీమాంధ్రులను కేసీఆర్‌ అక్కున చేర్చుకున్నారనీ, గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో సీమాంధ్రుల ఓట్లు టీఆర్‌ఎస్‌కే పడ్తాయని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగరాల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందనీ, అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతోన్నది విభజన కారణంగానేనని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.మొత్తమ్మీద, గ్రేటర్‌ హైద్రాబాద్‌లోని సీమాంధ్రులకు తెలంగాణ రాష్ట్ర సమితి గట్టిగానే గాలమేస్తోందనుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube