కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.
జోడో యాత్ర ఊహించినదానికంటే ఎక్కువ విజయవంతమైందని తెలిపారు.పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్న రాహుల్ గాంధీ… ముగింపు సభకు తీవ్రమైన మంచులో కూడా జనం బాగా వచ్చారని పేర్కొన్నారు.
అక్కడి ప్రజల బాధలు చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు.ఆర్టికల్ 370 రద్దుతో ఉపయోగం లేదని చెప్పారు.
కశ్మీర్ ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వెల్లడించారు.