జాతీయ పార్టీ బీఆర్ఎస్ విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు.హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని చెప్పారు.ఇటువంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని పేర్కొన్నారు.
అంతేకాకుండా కర్ణాటకలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామన్నారు.ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో కలిసి దేశమంతా తిరుగుతారని చెప్పారు.
కెసిఆర్ విజన్ నాయకుడని తెలిపారు.