ప్రజల గురించి ఆలోచించవలసిన నేతలు ఆ ఒక్కటి తప్ప ఇతర విషయాల గురించి ఆలోచించడం లో తమకు తామే సాటి అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటారు.ఒకవైపు దేశంలో పెరుగుతున్న ధరలను గురించి ఏ ఒక్క నాయకుడు నోరెత్తడం లేదు.
అమలు కానీ హమీలు గుప్పిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారే గానీ జనం గోస చెవికెక్కించుకోవడం లేదు.
ఇకపోతే బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు హైదరాబాద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ పేరును మార్చేస్తామని ఈ విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.ఇదే కాకుండా సమాజంలో మార్పును కూడా తీసుకువస్తామని తెలిపారు.
ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలిగించి, వారి మద్దతును కూడగట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇకపోతే గతంలోనూ కొందరు బీజేపీ నేతలు హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చుతామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ముందుగా దేశ ప్రజల జీవితాలను మార్చితే చాలని, భాగ్యనగర్ అని పేరు మార్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏం లేదని ధరల బరువులు మోస్తున్న జనం అనుకుంటున్నారట.