ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల విషయంలో భయం ఎందుకు ?

ఎస్‌ఈ‌సి పై ఏపీ హైకోర్టు లో వైకాపా ప్రభుత్వం విజయం సాదించింది.రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వంకు మొదటి నుండి కూడా పడటం లేదు.

 We Welcomes Virdict On Ap Panchayati Elections, Ap High Court On Sec,  Ysrcp Gov-TeluguStop.com

గతంలో కరోనా సమయంలో ఎన్నికల పోస్ట్ చేస్తూ ఎస్‌ఈ‌సి కీలక నిర్ణయం తీసుకుంది.ఈ విషయంపై జగన్ మరియు వైసీపీ మంత్రులు ఎం‌ఎల్‌ఏ లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ విషయంపై అప్పుడు కోర్టుకు వెళ్ళిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ హై కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది.అప్పటినుండి ఎస్‌ఈ‌సి పై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగానే ఉంది.

ఇప్పుడు పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఎస్‌ఈ‌సి కోరగా ఈ సమయంలో ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది.

Telugu Achhem, Ap, Ap Sec, Ap Panchayathi, Ap Tdp Achennai, Ys Jagan, Ysrcp-Telu

ఈ విషయంపై ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయిడు వైసీపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు.కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి తమ పంతం నెగ్గించుకుంది అన్నాడు.ఉద్యోగ సంఘాలను మీ కుట్రలో బాగస్వామ్యం చేశారు.

ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటున్న వైసీపీ ఎన్నికల నిర్వహణలో ఎందుకు భయపడుతుందని ప్రశ్నించాడు.నిన్న జగన్ లక్షల మందితో అమ్మఒడి కార్యక్రమాన్ని ఎలా ప్రారంబించడాని అన్నాడు.

హై కోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాంని అచ్చెన్నాయిడు అన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube