సీపీఎస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి అన్నారు.సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ న్యాయం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.పీఆర్సీ, ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మినహా పాత పెన్షన్ విధానంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు మంచి చేసే జగనే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.