అవినీతి రహిత తెలంగాణ కావాలి..: పవన్ కల్యాణ్

వరంగల్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ మేరకు బీజేపీ - జనసేన అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారాన్ని నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ ఆన్నారు.తెలంగాణ అంటేనే పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పారు.

అవినీతి రహిత తెలంగాణ కావాలన్న జనసేనాని రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిగా చూడాలన్నారు.తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా నిలవాలని కోరారు.తాను అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదన్న పవన్ నాయకులతో పని చేయించుకునేలా యువత, ప్రజలు ఉండాలని చెప్పారు.

Advertisement

నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.తెలంగాణను గుండెల్లో పెట్టి చూసుకుంటానన్న పవన్ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

Latest Latest News - Telugu News