టాలీవుడ్ సినీ నటుడు రానా నటించిన సినిమా అరణ్య ఈ సినిమా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఏనుగుల నేపథ్యంలో బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.ఇక ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినీ బృందం ప్రీ రిలీజ్ వేడుకలు జరుపుకుంది.ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకటేష్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుపుతూ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా ప్రకృతి గురించి మాట్లాడాలని అన్నాడు వెంకటేష్.ప్రకృతికి కోపం వస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు.
ప్రకృతితో ముడిపడి ఉన్న అడవి కథతో మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ ప్రభు సాల్మన్ కు కృతజ్ఞతలు.ఇక మనమందరం ఈ సినిమా చూసిన తర్వాత ఇంత మంచి సినిమా మనదేశంలో వచ్చినందుకు అందరం గర్వపడుతాం అని చెప్పుకొచ్చారు.
ఇక రానా గురించి కొన్ని విషయాలు చెబుతూ మావాడు అని కాదుఅని అంటూ అతని నటన నమ్మశక్యంగా లేదని, అతను ఎంతో ఎదిగిపోయాడని, తనకే పోటీ గా మారాడని ఇలాంటి సినిమా రానాకు ఇచ్చినందుకు ప్రభు సాల్మన్ కు మళ్లీ ధన్యవాదాలు తెలిపారు వెంకటేష్.అడవుల్లో షూటింగ్ అంటే చాలా కష్టమని, అరణ్య కోసం సినీ బృందం ఎంతో కష్టపడిందని తెలిపారు.ఇక సినిమాల్లో ఏనుగుల హావభావాలను ఎంతో బాగా చూపించారని కానీ అది అంత సులభం కాదు అంటూ మాట్లాడాడు.ఇక ప్రేక్షకులు ఈ సినిమాను కుటుంబంతో పాటు ఆస్వాదించాలి అంటూ కోరారు.