అమరావతి భూముల కుంభకోణం ఇప్పుడు రాష్ట్రం లో పెను సంచలనంగా మారింది.టీడీపీ పార్టీ వారు తమకి ఇష్టం ఒచ్చినట్టు భూములని తమ తమ మంత్రులకి రాసి ఇచ్చేసారు అనే దాని మీద సాక్షీ వారు పెద్ద కథనమే ప్రచురించారు.
అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా జనాలు వేరే గోల ఒదిలేసి దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఈ విషయం లో టీడీపీ చాలా తీవ్రంగా స్పందించడానికి సిద్దం అయినట్టు కనిపిస్తోంది.
భూ దందాకు పాల్పడ్డామంటూ తమపై వస్తున్న కథనాలు నిజమని నిరూపిస్తే, ఆ భూముల్ని ఆరోపిస్తున్నవారే తీసుకోవచ్చని అధికార పార్టీ నేతలు సవాల్ విసరడం గమనార్హం.నిరూపణ గనక జరిగి నిజం అని తెలిస్తే భూ కుంభకోణం విషయం బయటపెట్టిన వారు ఆ భూములు తీసేసుకోండి అని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.
లేదంటే సాక్షి మీద పరువు నష్టం దావా వేస్తాం అంటున్నారు వారు.