ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు షాకింగ్ కామెంట్స్.. అది కుదిరేపని కాదని..!

ఆనందయ్య కరోనా మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.ఆనందయ్యకు అండగా ఉంటామని వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారు అయినా సరే ప్రభుత్వం తరపునుండి తగిన సహకారం అందడం లేదని అన్నారు సంపత్ రాజు.

 No Support For Anandaiah Medicine From Ap Government Anandaiah Friend Sampath Ra-TeluguStop.com

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మందు ఇవ్వలేకపోతున్నానని ఆనందయ్య బాధపడ్డారని ఆయన అన్నారు.

కృష్ణపట్నం ఆనందయ్య మందు చాలా పాపులర్ అయ్యింది.

కరోనా రాకుండా.కరోనా వచ్చినా మూడు రకాల మందులతో దాన్ని కంట్రోల్ చేస్తుండటంతో ఒక్కసారిగా ఆయన మందు హాట్ టాపిక్ గా నిలిచింది.

ఆయుష్ డిపార్ట్మెంట్ ఆనందయ్య మందుపై నివేదిక కూడా ఇచ్చింది.ఫైనల్ గా గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆనందయ్య మందు పంపిణీకి తిరిగి రంగం సిద్ధమవుతుంది.

అయితే కృష్ణపట్నంలో సెక్షన్ 144 అమలులో ఉంది.మందు పంపిణీ జరగదని.

అక్కడకు ఎవరు ప్రజలు రావొద్దని అంటున్నారు ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు.ఆనందయ్య రోజుకి కేవలం 5 వేల మందికి సరిపడా మందుని మాత్రమే తయారు చేస్తాడని అన్నారు.

ఇతర ప్రాంతాల వారికి లక్షల మందికి మందు సరఫరా చేయడం కుదరదని ఆయన అన్నారు.ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని అన్నారు సంపత్ రాజు.

ఆన్ లైన్ ద్వారా మందు సరఫరా చేయడం కుదరేపని కాదని సంపత్ రాజు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube