దేశవ్యాప్తంగా గొడ్డు మాంసాన్ని నిషేధించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.మహారాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే గొడ్డు మాంసం నిషేధిస్తూ ఆదేశాలిచింది.
హైకోర్టులోనూ తన ఆదేశాలను సమర్ధించుకుంది.గొడ్డు మాంసం నిషేధంపై భాజపా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది.అయితే దీనిపై సొంత పార్టీ వారే తిరగబడుతున్నారు.‘మేం గొడ్డు మాసం తింటాం’ అని ఢంకా బజాయించి చెబుతున్నారు.ఎక్కడ? మేఘాలయ రాష్ర్టంలో.గొడ్డు మాంస భక్షణకు వ్యతిరేకంగా ప్ర చారం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మేఘాలయ వెళ్లారు.అయితే ఈ నిరసనలో పాల్గొనేందుకు అక్కడి భాజపా నాయకులు, కార్యకర్తలు అంగీకరించలేదు.‘మేం నిరసన కార్యక్రమంలో పాలుపంచుకోం.మేం గొడ్డు మాంసాన్ని నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నాం.మేఘాలయ గొడ్డు మాంసం, పంది మాంసం తినే రాష్ర్టం.గొడ్డు మాంసం, పంది మాంసం తినడం మా హక్కు’ అని మేఘాలయ భాజపా అధ్యక్షుడు తెగేసి చెప్పారు.దేశవ్యాప్తంగా గొడ్డు మాంసాన్ని నిషేధించడం సరైన వ్యూహం కాదన్నారు.
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మేనకా గాంధీ ఆవు మాంసం, గొడ్డు మాంసం నిషేధం పట్ల చాలా పట్టుదలగా ఉన్నారు.దేశంలో ఆవుల వధ జరగడానికి ఒప్పుకోం.
దీన్ని నిషేధించేందుకు మా శక్తినంతా ఉపయోగిస్తాం అన్నారు.గొడ్డు మాంసాన్ని నిషేధించడం మోదీ సర్కారుకు మేలు చేస్తుందో, కీడు చేస్తుందో చూడాలి.