డిల్లీలో నేడు జరిగిన అఖిల పక్ష సమావేశానికి 18 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టలపై చర్చించారు.
ఈ భేటీ అనంతరం టిఆర్ఎస్ పార్టీ ఎంపి కేకే మీడియా సమావేశంలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు తప్పుకుండా కేంద్రానికి సహకరిస్తాం అన్నాడు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో నైనా స్నేహం చెయ్యడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నాడు.
రాష్ట్రనికి చెడు చేసే ఏ పని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యదని గుర్తు చేశాడు.
టిఆర్ఎస్ నాయకుడు నామ నాగేశ్వరావు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకు వచ్చింది.కొత్తగా తీసుకు వచ్చిన రైతు చట్టాలను టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని అన్నాడు.
రిపబ్లిక్ డే రోజున రైతులపై జరిగిన ఘటన ను సాకుగా చూపు రైతులను విస్మరించకూడదని అన్నాడు.తమకు తెలంగాణ ప్రయోజనలే ముఖ్యం అని అన్నాడు.