భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లో అజేయంగా నిలిచినా టీం ఇండియా భరత్ లోని అందరికీ సంబరాలు అందించింది.ముఖ్యంగా న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయిన తరుణం లో తప్పనిసరిగా గెలవాల్సిన భరత్ గెలిచి తమ సత్తా చాటుకుంది.
ఈ మ్యాచ్ తరవాత మీడియా తో మాట్లాడిన ధోనీ స్పిన్నర్లని ఇంకా బాగా ఎదురుకోవాలి అని చెప్పుకొచ్చాడు.పాకిస్తాన్ మీద విజయం కష్టంగా సాధించినది అని అన్నాడు
యువరాజ్ ఇన్నింగ్స్ ని పొగిడిన ధోనీ విరాట్ కోహ్లీ మధ్యలో సింగిల్స్ తీయడం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది అని చెప్పుకొచ్చాడు.” ప్రస్తుతం ఉన్న జట్టు ప్రదర్సన తో సాటిస్ఫై అవ్వకుండా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా మెరుగైన ఆట ప్రదర్శించే దిశగా వెళదాం ” అన్నాడు ధోనీ.నాకౌట్ మ్యాచ్ లు కాబట్టి ఇప్పుడు అన్ని మ్యాచ్ లూ తమకి కీలకం అని ఏప్రిల్ 3 న ఈడెన్ లో జరిగే ఫైనల్స్ లో నిలవడం కోసం కృషి చేస్తాం అన్నాడు ధోనీ.