ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కాలంలో మందుబాబులు మందు కోసం ఎన్ని వింత వింత ఐడియాలు వేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మద్యం కోసం అటు ఇటు పడి లేస్తున్న ఈ మద్యం బాబు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు.
ఎలా అనుకుంటున్నారా? అదేనండి.వాటర్ ట్యాంకర్ లో ఏకంగా 10 వేల మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయారు.
ఇక ఈ ఘటన ఏపీలో గుంటూరు సరిహద్దులో చోటుచేసుకుంది.తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ట్రక్కులు, బండ్లు, ట్రాక్టర్లు, పడవలు, వాటర్ ట్యాంకర్లు, గ్యాస్ సిలిండర్లలో సినీ ఫక్కీలో ఆంధ్రకు మద్యాన్ని తరలిస్తున్నారు.
ఇక ఇప్పుడు గుంటూరులో వాటర్ ట్యాంకర్లో 10 వేల మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే? ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత మొత్తం మద్యం సీసాలు పట్టుబడటం ఇదే తొలిసారిని అని అధికారులు చెప్తున్నారు.కాగా మద్యం దుకాణాలు తిరిగి తెరిచినా రోజు నుంచి 75 శాతం ధరలు పెరగడం వల్లనే మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం.