ఇటీవల భూగర్భ జలాలు అడుగంటి పోతున్న పరిస్థితి నెలకొంది.దీంతో తాగునీటి సమస్య రోజురోజుకి పెరిగిపోతోంది.
ప్రధానంగా బెంగుళూరు( Bangalore ) మరియు హైదరాబాదు నగరాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉండటంతో ప్రభుత్వాలు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.నీరు వృధా( Water Wastage ) చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఫైన్ లు కూడా వేసే పరిస్థితి నెలకొంది.
ప్రజలు కాస్త నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.బెంగళూరులో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
మూడు దశాబ్దాల నుంచి ఎప్పుడు లేని పరిస్థితి నెలకొంది.సమస్య పరిష్కరించడానికి అధికారులు చర్యలు చేపడుతున్న నీటి సమస్య రోజురోజుకి తీవ్రమవుతోంది.
దీంతో గేటెడ్ కమ్యూనిటీలు, అనేక అపార్ట్ మెంట్ లలో, ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు రూల్స్ స్ట్రిక్ట్( Strict Rules ) చేశాయి.ఈ పరిణామాలతో బెంగళూరు వాసులు ఐదు రోజులకు స్నానాలు చేయాల్సిన స్థితికి వచ్చారు.ఇదే సమయంలో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు.నీటి కొరత కారణంగా బెంగళూరులో ఐటీ కంపెనీ ఉద్యోగస్తులు( IT Company Employees ) యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా బెంగళూరు నీటి కొరత సమస్య క్యాష్ చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం( Kerala Government ) సంచలన ప్రకటన చేసింది.తమ రాష్ట్రంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోమని బెంగళూరులోని పలు ఐటీ కంపెనీలను ఆహ్వానించింది.
కేరళలో 44 నదులు ఉన్నాయని.కాబట్టి నీటి కొరతకు అవకాశమే లేదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్( Kerala Industries and Law Minister P Rajeeve ) పేర్కొన్నారు.
ప్రస్తుతం బెంగళూరులో 500 మిలియన్ లీటర్ల నీటి కొరత ఏర్పడింది.ఈ నీటి సంక్షోభం( Water Crisis ) అధిగమించేందుకు సీఎం సిద్ధరామయ్య అధికారులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.