దేశంలో మొదటి సారిగా గాలి నుంచీ నీటిని తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు సికింద్రాబాద్ రైల్వే శాఖ.ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశామని తెలిపారు.
అంతేకాదు సహజంగా మనం త్రాగే నీటికంటే కూడా ఇది ఎంతో స్వచ్చంగా ఉంటుందని తెలిపారు.తమ ప్రయాణికులకి స్వచ్చమైన నీటిని అందించాలనేది తమ నిర్ణయమని అందుకే ఈ విధానాన్ని పరిశీలించామని ఇది ఎంతో మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు.
అసలు గాలి నుంచీ నీటిని ఎలా బయటకి తీస్తారు.ఇదే సాధ్యపడుతుంది అంటే.గాలిలోని నీటి అణువులని వడిసి పట్టి ఈ నీటిని తీస్తున్నారు.వామ్మో అనుకుంటున్నారా టెక్నాలజీ మారుతున్న కొద్దీ అసంభవం అనుకున్నవి కూడా జరిగిపోతున్నాయి.
సరే ఈ నీటిని ఒడిసి పట్టడానికి ఏమి చేస్తున్నారంటే.గాలి నుంచే నీటిని తీసే పరికరం ఆట్మోస్పియరిక్ వాటర్ జనరేటర్ ని ఉపయోగించి తీస్తారు.
ఈ యంత్రానికి మెఘ్ దూత్ అని పేరుని కూడా పెట్టారు.
ఈ యంత్రం గాలి నుంచీ అంచెలంచలుగా నీటిని సేకరిస్తుంది.ఈ నీటిని యంత్రంలోకి పంపుతారు.అక్కడ ఈ నీరు వాడబోయబడుతుంది.
అదేవిధంగా గాలిలో ఉండే తేమలోని కాలుష్యాని అక్కడే శుద్ది చేస్తారు.ఆ తరువాత శుద్ది చేయబడిన గాలి చల్లని గదిలోకి వెళ్లి అక్కడ ఘన పదార్ధంగా మారుతుంది.
ఈ గట్టిపడిన గాలి నీటి చుక్కలుగా పడుతూ నీటిని సేకరిస్తుంది.ఈ విధంగా వచ్చిన నీటిలో ఖనిజ లవణాలు కలపడంతో అది మంచినీరుగా మారుతుంది.
ఇలా ఈ యంత్రం 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుంది.లీటర్ బాటిల్ నీటిని రూ.8 కి అమ్ముతుండగా, బాటిల్ లేని నీటిని రూ.5 కే అముతున్నారు.