తెలంగాణాలో మరోసారి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ … ఇప్పుడు ఎన్నికల వాగ్దానాల మీద దృష్టిపెట్టింది.దీనిలో భాగంగానే… ఇప్పుడు అనేక పధకాలను అమలు చేస్తోంది.
తాజాగా నల్లా కనెక్షన్ ల డిపాజిట్లు తగ్గిస్తూ… తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దారిద్ర రేఖ కు దిగువనున్న కుటుంబాల కోసం రూ.1 కే కనెక్షన్ ఇవ్వాలని ఇతరులకు రూ.100 కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు పట్టణాల్లో ఇంటి నల్లా కనెక్షన్ కోసం ఆరు వేలు, గ్రామాల్లో పదిహేను వందలు డిపాజిట్ కింద తీసుకునేవారు.అయితే ఇప్పుడు భారీగా డిఫాజిట్స్ రేటు తగ్గించడం ద్వారా… సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది.ఈ మేరకు తెలంగాణలోని అన్ని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.