అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అందరిని భయపెడుతూ ఉంటాయి.ఆ సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికి కూడా భయపడతారు.
ఇప్పుడు అలాంటి సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగింది.కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఊరికి మంచినీటిని అందించే ట్యాంకులో నిన్న రాత్రి పురుగుల మందును గ్రామస్తులపై విషప్రయోగం చేసారు.
అయితే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర వాచ్ మెన్ గా పని చేస్తున్న పోలయ్య ఉదయాన్నే నీటిని విడుదల చేసేందుకు వచ్చాడు.కానీ కొత్తగా ఏదో వాసన రావడంతో ట్యాంక్ పైకి వెళ్లాడు.
అక్కడ నీటిలో పురుగుల మందు వాసన రావడాన్ని గుర్తించాడు.ఈ విషయాన్ని పోలయ్య గ్రామస్తులకు తెలియజేశాడు.
వారు ఇచ్చిన సమాచారంతో గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసిన కొవ్వూరు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
పోలయ్య అప్రమత్తతతో ఆ గ్రామం మొత్తం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకున్నారు.